Friday, May 17, 2024

బిల్లా స్పెషల్ షో.. థియేటర్ లో బాణసంచా పేల్చిన ఫ్యాన్స్..సీట్లకు మంటలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఓ థియేటర్ లో మంటలు చెలరేగాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందులో బిల్లా స్పెషల్ షో వేయించారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు. సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement