Wednesday, May 1, 2024

అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర : స్పీకర్‌ తమ్మినేని

శ్రీకాకుళం : అమరావతి రైతుల పేరుతో బినామీలు పాదయాత్ర చేస్తున్నారని, మొదటినుంచి వారు రైతులు కాదని చెబుతున్నామని, సంపన్నుల భూములను కాపాడుకోవడం కోసం రైతుల ముసుగులో బినామీలు ఉద్యమం చేస్తున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మొత్తం 29,000 మంది భూములు ఇస్తే, 70 మంది మాత్రమే రైతులు ఉన్నారన్నారు. నిన్న పోలీసుల ఐడి కార్డుల తనిఖీల్లో ఈ విషయాలు భయటపడ్డాయన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు మాయ చేశారన్నారు. అమరావతిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అన్నారు. విజయవాడ దేనికి సెంట్రల్‌ లొకేటెడ్‌… సామాజికవర్గాన్ని కేంద్రీకరించటానికా? అని ప్రశ్నించారు. విశాఖ రాజధానికి అన్ని విధాలా అనుకూలమైన నగరమని, అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని, అమరావతి రాజధానికి అనువుకాదని శ్రీకృష్ణ కమిటీ- రిపోర్ట్‌ ఇచ్చిందన్నారు. విశాఖ రాజధాని విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోందన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్‌ చరిత్ర కారుడిగా నిలుస్తారని.. వ్యతిరేకించేవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement