Monday, May 6, 2024

తుపాకీతో బెదిరించి న‌డిరోడ్డుపై చైన్ స్నాచింగ్

బైక్ పై వెళ్తున్న‌ ఓ మ‌హిళను పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టి ఆమె‌ మెడ‌లో నుంచి చైన్ లాక్కెళ్లిన సంఘటన మధ్యప్రదేశ్ లోబైక్ పై వెళ్తున్న‌ ఓ మ‌హిళను పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టి ఆమె‌ మెడ‌లో నుంచి చైన్ లాక్కెళ్లిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. గ్వాలియ‌ర్‌లో న‌డిరోడ్డుపై అడ్డ‌గించిన ఇద్ద‌రు యువ‌కులు అంద‌రూ చూస్తుండ‌గానే మహిళకు తుపాకీ చూపి బెదిరించి, ఆమె మెడ‌లోంచి గొలుసు లాక్కెళ్లారు. కొన్ని సెక‌న్ల‌లో ప‌ని కానించి బైక్‌పై పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి.  త‌న కుమారుడిని మ‌హిళ ట్యూషన్ వ‌ద్ద విడిచిపెట్టేందుకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండ‌గుల‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement