Thursday, May 16, 2024

Sai Baba: ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్..

ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు భారీ ఊర‌ట‌ లభించింది. సాయిబాబాపై కేసును బాంబే హైకోర్టు ఇవాళ‌ కొట్టేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో.. కొన్నేళ్లుగా ముంబై జైళ్లో ప్రొఫెసర్ సాయిబాబా ఉన్నారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయని సాయిబాబాపై ఎన్ఐఏ గతంలో కేసు నమోదు చేసింది. ఇక, మావోయిస్టులతో లింకులున్నాయని మహారాష్ట్ర పోలీసులు 2013లో సాయిబాబాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2014 మే 9 న మహారాష్ట్రలో ఆయన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement