Saturday, May 4, 2024

TS : మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలి… జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్, మార్చి 5 (ప్రభ న్యూస్): జిల్లా లో మన ఊరు మన బడి క్రింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళ వారం ఉదయం టెలి కాన్ఫరెన్సు ద్వారా జిల్లా లో జరిగే మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పెండింగ్ పనులను పూర్తిచేయాలనీ, సి సి రోడ్ల నిర్మాణ పనులు మరియు మన ఊరు మన బడి పాఠశాలలకు అవసరమయ్యే పనులను పెండింగ్లో ఉంచకుండా 100శాతం పనులు పూర్తి చేసి ఎఫ్ టిఓ జనరేట్ చేయాలని, పాఠశాలలలో ఇంకా ఏ ఏ పనులు మిగిలి ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెలి కాన్ఫరెన్సులో ఈఈ ఆర్అండ్ బి, డిఇఓ, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డిఈలు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement