Monday, April 29, 2024

ఉద్యోగులకు శుభవార్త.. రూ.10వేలు అడ్వాన్స్

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. హోలీ పండగ సందర్భంగా ఉద్యోగులకు రూ. 10వేలు అడ్వాన్సుగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో హోలీ జరగనుంది. ఈ క్రమంలో హోలీ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అడ్వాన్సు తీసుకునేందుకు మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది. అడ్వాన్సు తీసుకున్న ఉద్యోగులు నెలకు రూ. 1000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. డబ్బు అవసరమున్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న మూడు విడతల డీఏ, డీఆర్‌ను జూలై నుంచి పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement