Sunday, May 26, 2024

Bhuvanagiri Review – 420 హామీలు చేసేంత‌వ‌ర‌కు కాంగ్రెస్ ను వెంట‌బ‌డి త‌రుముతాం …కెటిఆర్

హైద‌రాబాద్ – ప‌దేళ్లో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే… కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయిందని , ఫిబ్ర‌వ‌రి నుంచి అస‌లు సినిమా చూపిస్తామ‌ని కాంగ్రెస్ ను హెచ్చ‌రించారు..తెలంగాణ భవన్ లో నేడు జ‌రిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నాయకులకు , కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ఒక్కొ హామీకి తిలోదకాలు ఇస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు.. అధినాయ‌కుడు కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి సినిమా స్టార్ట్ అవుతుందని అన్నారు

420 హామీలు కాంగ్రెస్ అమ‌లు చేయాల్సిందే –
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చెయ్యాలన్నారు.అయిదే ఏళ్ల‌ పాటు హామీలు అమ‌లు చేసే వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగ చదవి అవి అమలు చేసేంత వరకు వదలొద్దని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఒక్క నెలలోనే ప్రజల వ్యతిరేకతను ముటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను కాంగ్రెస్ పార్టీ కరపత్రంలా మాట్లాడించారని తెలిపారు. కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారని తెలిపారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు.

కాళేశ్వ‌రంపై విచార‌ణ‌ను స్వాగ‌తిస్తున్నాం – పోచారం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం పై విచారణ చేసుకోండి స్వాగతిస్తున్నమని అన్నారు. తప్పు తేలితే శిక్ష పడుతుందని అన్నారు. కాళేశ్వరంను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు ? అని ప్రశ్నించారు. నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కు సూచిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. యాసంగి పంట దిగుబడి తగ్గుతుంది అని అంటున్నారని తెలిపారు. రైతులు పంట పండించుకునే అవకాశం ఇవ్వడం…నీటిని విడుదల చేయండని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకురావాలన్న కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అనాలోచితం అని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement