Monday, April 29, 2024

Delhi | ఖర్గేతో భట్టి మంతనాలు.. రెండ్రోజులుగా ఢిల్లీలోనే సీఎల్పీ నేత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. చేవెళ్లలో ఈనెల 26న తలపెట్టిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రకటించబోయే దళిత, గిరిజన డిక్లరేషన్ కోసం ఆదివారం ఢిల్లీ వచ్చిన భట్టి, సోమవారం ఖర్గేతో విడిగా మంతనాలు సాగించారు.

- Advertisement -

గంటకు పైగా తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఆయనకు వివరించినట్టు తెలిసింది. తాను చేపట్టిన పాదయాత్ర గురించి ఆయనకు వివరించడంతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చించినట్టు సమాచారం. ఖర్గేతో భేటీ అనంతరం ఆయన సీడబ్ల్యూసీ సభ్యులు ముకుల్ వాస్నిక్‌తో సమావేశమయ్యారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement