Friday, May 17, 2024

మ‌సాజ్ సెంట‌ర్ పేరుతో అసాంఘిక కార్య‌క‌లాపాలు : ఐదుగురు మ‌హిళ‌ల అరెస్ట్

మ‌సాజ్ సెంట‌ర్ పేరుతో అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న మ‌సాజ్ సెంట‌ర్ పై పోలీసులు ఆక‌స్మిక దాడులు చేశారు. ఈ మేర‌కు మసాజ్ సెంట‌ర్ ని సీజ్ చేశారు. ఈ సంఘ‌ట‌న ఏఎస్ రావు న‌గ‌ర్ లో చోటు చేసుకుంది. గ్లోవిష్ బ్యూటీ కేర్ పేరుతో గ‌త కొంత‌కాలంగా మ‌సాజ్ సెంట‌ర్ ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్‌ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement