Tuesday, April 30, 2024

ప్రధాన రహదారిపై ఎలుగుబంటి మృతి.. అధికారుల‌కు స‌మాచారం అందించిన గ్రామ‌స్తులు

కామారెడ్డి, ప్రభన్యూస్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట తండా శివారులోని అటవీప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ఎలుగుబంటి మృతి చెందింది. మంగళవారం తండా వాసులు, ఉపాధి పనికి వెళ్తున్న గ్రామస్తులు అటువైపుగా వెళ్తుండగా చింతగట్టు వద్ద రోడ్డుపక్కన ఎలుగుబంటి పడి ఉండటం గమనించారు.. దానిని పరిశీలించగా మృతి చెందినట్టుగా గుర్తించారు. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి ఎలా మృతి చెందింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement