Saturday, April 27, 2024

ఈటెలను ముఖ్యమంత్రిని చేస్తాం: బీసీ సంఘాలు

తెలంగాణలోని బీసీలం అందరం ఏకమై మాజీ మంత్రి, ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి ని చేస్తామని తెలంగాణ బీసీ సంఘం స్పష్టం చేశారు. ఈటలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిసనగా సీఎం కేసీఆర్ సహా మంత్రులు కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్ ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రులతో ఈటలపై అసత్య ఆరోపణలు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీసీ సంఘం నాయకులు మంత్రుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈటల రాజేందర్ పై మంత్రులు కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈటల రాజేందర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైదరాబాద్ గన్ పార్క్ ముందు ఆందోళనకు దిగిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రచాల యుగేందర్ గౌడ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన ఈటల రాజేందర్ ను ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ లను ఏకం చేసి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కాగా, భూకబ్జా ఆరోపణలపై ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించడంతో బీసీ సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు ఆయనకు మద్దుతు తెలిపిన సంగతి తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement