Tuesday, May 21, 2024

టర్కీలో బాలకృష్ణ సినిమా.. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట‌ర్ అంటున్న సినీ వ‌ర్గాలు

నందమూరి బాలకష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ టర్కీలోని ఇస్తాంబుల్‌ వెళ్ళింది. ఇక్కడ సినిమాలోని ప్రముఖ తారాగణంతో కీలక భాగాన్ని చిత్రీకరించనున్నారు. దర్శకుడు గోపీచంద్‌ మలినేని షూటింగ్‌ లొకేషన్‌ నుండి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్సయిట్‌మెంట్‌ ఈ ముగ్గురిలో కనిపిస్తోంది. టాకీ పార్ట్‌ కాకుండా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకస్తారు.

ఈ సినిమా నుండి బాలకృష్ణ పుట్టినరోజున రెండు ప్రత్యేక ట్రీట్‌లను అందించారు. ఫస్ట్ హంట్‌ వీడియో, ఆపై మాస్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ రెండింటికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్‌ మాస్టర్స్‌గా రామ్ ల‌క్ష్మణ్‌ పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement