Saturday, May 4, 2024

Breaking: గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.. పెద్దపల్లిలో 43 పరీక్షా కేంద్రాలు

గ్రూప్ 1 పరీక్షల కోసం రామగుండం కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షల కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని 15,792 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement