Wednesday, April 24, 2024

Breaking: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. మిల్క్​ వ్యాన్​ని ఢీకొన్న టెంపో, 9 మంది మృతి

కర్టనాక రాష్ట్రం హసన్​ జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్, మిల్క్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. హాసన్ జిల్లా 69వ జాతీయ రహదారిపై అర్సికెరె తాలూకా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ధర్మస్థల టూర్​ వెళ్లిన యాత్రికులు టెంపో ట్రావెలర్‌పై స్వగ్రామానికి వస్తున్నారు.

ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ఎదురుగా వస్తున్న పాల వ్యాన్​ని ఢీకొట్టింది. ఆ తర్వాత మరో బస్సు, ట్రక్కును కూడా ఢీకొట్టింది. ఈ సమయంలో టెంపో ట్రావెలర్‌లో 14 మంది టూరిస్టులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను హాసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement