Sunday, May 5, 2024

నిజాం కాలేజీ హాస్టల్‌ సీట్లకు దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిజాం కాలేజీ హాస్టల్‌ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. 50 శాతం చొప్పున యూజీ, పీజీ విద్యార్థినులకు సీట్లను కేటాయిస్తామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. 17వ తేదీన వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 19వ తదీన ఫైనల్‌ లిస్టును విడుదల చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే హాస్టల్‌లోని సీట్లను తమకే కావాలని గత కొన్ని రోజులుగా నిజాం కాలేజీల విద్యార్థినులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement