Monday, May 6, 2024

జూన్‌ 30న పాలిసెట్‌, 9వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు (టీఎస్‌ పాలిసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. హైదరాబాద్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ తెలంగాణ ఈ నోటిఫికేషన్‌ను శనివారం జారీ చేసింది. జూన్‌ 30వ తేదీన పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈనెల 9 నుంచి పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.

దరఖాస్తుల స్వీకరణను జూన్‌ 4వరకు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్‌ ఫలితాలు ఉంటాయని తెలిపారు. పాలిసెట్‌ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంజనీరింగ్‌/నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement