Saturday, April 27, 2024

తెలంగాణ సంపదపై ఏపీ నేతల కన్ను : గంగుల క‌మ‌లాక‌ర్

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో గ‌త కొంత‌కాలంగా ఏపీ నేత‌లు తెలంగాణ‌లో త‌మ పార్టీపై ప‌ట్టు సాధించాల‌ని ప్ర‌చారాలు, పాద‌యాత్ర‌లు, స‌భ‌లు పెడుతున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి మంత్రి గంగుల కమలాకర్ స్పందింద‌చారు. తెలంగాణ సంపదపై ఏపీ నేతల కన్నుపడిందని అన్నారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ఆర్ కూతురు షర్మిల ఇక్కడ పాగా వేశారన్న ఆయన పవన్ కల్యాణ్, కేఏ పాల్ కూడా తెలంగాణకు వచ్చారన్నారు. తాజాగా చంద్రబాబు కూడా తెలంగాణలో ఎంటరయ్యారని చెప్పారు. మళ్లీ ఏపీ, తెలంగాణలను కలపాలన్నదే వీరి అజెండా అని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement