Saturday, May 4, 2024

హైకోర్టులో కేంద్రంపై ఆరోపణలు చేసిన ఏపీ సర్కారు

ఏపీలో కోవిడ్ నియంత్రణపై గుంటూరుకు చెందిన ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన సుమోటో పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో అవసరానికి సరిపడా రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా జరగటం లేదని ప్రభుత్వం తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అటు ఆక్సిజన్ సరఫరా కూడా కేంద్రం నుంచి డిమాండ్‌కు సరిపడా జరగటం లేదని ప్రభుత్వం తెలిపింది. తక్కువ కేసులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

100 టన్నుల ఆక్సిజన్‌లో మహారాష్ట్రకు 97 టన్నులు, ఏపీకి 3 టన్నుల సరఫరా చేశారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాలకు అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలెన్సింగ్ చేస్తామని కేంద్రం తెలిపింది. ఆసుపత్రుల్లో బిల్ చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ద్వారా చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు అవసరానికి సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లు ఎపుడు చేస్తారని కూడా హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం సమాధానమిస్తూ మూడు నెలల సమయం పడుతుందని తెలిపింది.

అయితే ఇది చాలా ఎక్కువ సమయమని, వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశించింది. కంప్రెషర్ల తయారీలో జాప్యం జరుగుతోందని, జూన్ మొదటి వారంలో 15 ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం తెలిపింది. కర్ఫ్యూ వల్ల కేసుల నమోదులో తేడాలు ఏమన్నా వచ్చాయా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాగా తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement