Monday, May 6, 2024

చ‌క్దా ఎక్స్ ప్రెస్ షూట్ కంప్లీట్.. చివ‌రి క్లాప్ క‌ట్టిన జుల‌న్

చ‌క్దా ఎక్స్ ప్రెస్ షూటింగ్ కంప్లీట్ అయింని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వెల్ల‌డించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చ‌క్దా ఎక్స్ ప్రెస్.ఈ చిత్రం కోసం తనకు ఎంతగానో సహకరించడంతో పాటు చివరి క్లాప్ కొట్టిన జులన్ కు అనుష్క ధన్యవాదాలు చెప్పింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం వచ్చే ఏడాది నేరుగా నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. భారత మహిళా క్రికెట్ దిగ్గజ క్రీడాకారిణి జులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా కోసం అనుష్క ఎంతగానో కష్టపడింది. అచ్చం గోస్వామిగా రూపాంతరం చెందింది. ఇందుకు ప్రత్యేక ట్రెయినింగ్ తీసుకుంది.

ఎన్నో రోజులు కష్టపడి గోస్వామి మాదిరిగా బౌలింగ్ వేయడం నేర్చుకుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా వెల్లడించింది. చివరి రోజు షూటింగ్ కు జులన్ ను కూడా చిత్ర బృందం ఆహ్వానించింది.సినిమా ముగింపు షాట్ కి జులన్ క్లాప్ కొట్టింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమిండియా జెర్సీ ధరించిన అనుష్క.. దర్శకుడు ప్రోసిత్ రాయ్, జులన్ తో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమెతో సరదాగా దిగిన మరికొన్ని ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement