Sunday, April 28, 2024

Flash: ఏపీలో మరో కొత్త జిల్లా.. మంత్రి పేర్ని నాని క్లారిటీ

గిరిజన ప్రాంతాలన్నీ ఒకే జిల్లాగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆలోచనని మంత్రి పేర్నినాని తెలిపారు. మచిలీపట్నంలో జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాలు కలపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాలనను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నాం’’ అని పేర్నినాని వ్యాఖ్యానించారు. రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement