Monday, May 6, 2024

కరోనా వైరస్‌కు మరో మృగరాజు బలి

తమిళ‌నాడు రాష్ట్రం వాండ‌లూర్‌లోని అరైన‌ర్ అన్నా జూలాజిక‌ల్ పార్కులో మ‌రో సింహం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మృతిచెందింది. జూలోని ఏసియాటిక్ మ‌గ సింహం ప‌ద్మ‌నాథ‌న్ (12) గ‌త కొన్ని రోజులుగా క‌రోనాతో బాధ‌ప‌డుతున్న‌ది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ ఉద‌యం ప్రాణాలు విడిచింది. దాంతో అరైన‌ర్ అన్నా జూలాజిక‌ల్ పార్కులో క‌రోనా కార‌ణంగా మృతిచెందిన సింహాల సంఖ్య రెండుకు చేరింది.

ఈ నెల 3న జూలోని నీలా (9) అనే ఆడ సింహం క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందింది. అదేరోజు మిగ‌తా సింహాల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా మొత్తం తొమ్మిది సింహాల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అప్ప‌టి నుంచి వైద్యులు వాటికి ప్ర‌త్యేకంగా చికిత్స అంద‌జేస్తున్నారు. వాటిలో మూడు సింహాలు చికిత్సకు నిదానంగా స్పందిస్తున్నాయ‌ని జూ అధికారులు తెలిపారు. వాటిలోని ఒక సింహ‌మే ఇప్పుడు వైర‌స్ ముదిరి మ‌ర‌ణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement