Thursday, May 2, 2024

అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు

శివభక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28 నుంచి ప్రారంభంకానుంది. 56 రోజుల పాటు జరిగే యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను అమర్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన 40వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరూ కరోనా మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. కాగా గతేడాది కరోనా మహమ్మారి కారణంగా యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement