Tuesday, May 7, 2024

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం నాడు విడుదల చేశారు. 92.85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది 72,488 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి సురేష్ చెప్పారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 83,822 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు మాత్రం 78,066 మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 72,488 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నెల 8న ఇంజనీరింగ్ విభాగం ప్రవేశపరీక్ష ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చందన్ విష్ణు వివేక్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాస కార్తికేయ రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాన్ రావుకి మూడో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన గజ్జల సమీహనరెడ్డికి నాలుగో ర్యాంక్, కాసా లహరికి ఐదో ర్యాంకు దక్కిందని మంత్రి సురేష్ వివరించారు. రేపటి నుండి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి సురేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement