Sunday, May 12, 2024

ఒక్క రూపాయి దానం చేయాలని యాంకర్ రష్మీ అభ్యర్థన

బుల్లితెర ఫేమస్ యాంకర్ రష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక్క రూపాయి దానం చేయాలని కోరుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ‘నెల రోజుల క్రితం ఇషాన్ అనే కుక్క అనుకోకుండా ఆరో అంత‌స్తు నుండి కింద ప‌డింది. దీనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇషాన్ చికిత్స‌కు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఆ కుక్క‌కి అప్ప‌టి వ‌ర‌కు చికిత్స అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అంద‌రం సాయం చేస్తే అది మ‌రింత పెద్ద‌ది అవుతుంది’ అని రష్మీ తెలిపింది.

సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను అనుసరిస్తున్న వారు 37,7800 మందికి పైగానే ఉన్నారని.. ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అది చాలా పెద్ద‌ది అయి కుక్క చికిత్స‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలియ‌జేస్తూ త‌న ఇన్‌స్టా ద్వారా డొనేట్ చేయాల్సిన లింక్‌ను కూడా యాంకర్ రష్మీ షేర్ చేసింది. కాగా మూగ జీవాల‌పై ర‌ష్మీ చూపిస్తున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పై నెటిజన్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: సెప్టెంబరు 10న నాని ‘టక్ జగదీష్’ రిలీజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement