Friday, May 3, 2024

పంద్రాగస్టు వేడుకల్లో అమెరికా గాయకురాలు మేరీమిల్‌బెన్‌.. తొలిసారిగా భారత్‌ ఆతిథ్యం

40 ఏళ్ల మేరీ మిల్‌బెన్‌ అమెరికాలో ప్రసిద్ద గాయకురాలు. మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్‌ మొదటిసారిగా అమెరికాకు చెందిన కళాకారిణిని ఆహ్వానిస్తోంది. ఆఫ్రికన్‌ అమెరికన్‌ గాయకురాలుగా అంతర్జాతీయంగా పేరు గడించిన మేరీ మిల్‌బెన్‌ దేశ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడానికి భారత్‌ రానున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసిసిఆర్‌) ఆహ్వానం మేరకు భారత్‌ వస్తున్నట్లు మేరీ మిల్‌బెన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement