Friday, May 17, 2024

ఆడ‌వారికి వ‌డ్డాణం – ప‌వ‌న్ కు వారాహి వాహ‌నం – అంబ‌టి

సత్తెనపల్లి : అసలు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని, రాజకీయాల కోసం ఏదయినా చేసే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబ‌టి రాంబాబు వాఖ్యానించారు.. టిటిపికి రాజకీయ లబ్ది చూకూర్చేందుకే పవన్ పార్టీ పెట్టార‌ని, ఆయన నాయకుడు కాద‌ని, చంద్ర‌బాబుకి కూలీ నెంబర్ 1 అంటూ విమ‌ర్శించారు.. స‌త్తెన‌ప‌ల్లిలోఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,
పవన్ కల్యాణ్, జనసేన పార్టీ రోజురోజుకు మరగుజ్జులా మారిపోతుందని అన్నారు. పవన్ పెరగడు తరులను పెరగనివ్వడని కౌంట‌ర్ ఇచ్చారు… రాజకీయ పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పవన్ నోట్లో వేలు పెట్టుకుని చంద్రబాబు చేయి పట్టుకునే తిరుగుతున్నార‌ని అన్నారు.

జనసేన ప్రచారం కోసం పవన్ కల్యాణ్ తయారుచేయించుకున్న వారాహి వాహనం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదులుతుందని అంబ‌టి సెటైర్ వేశారు… ఆడవాళ్లు బంగారు వడ్డాణం చేయించుకున్నట్లు పవన్ వారాహి వాహనం చేయించుకుని దాచుకున్నార‌ని ఎద్దేవా చేసాడు. దళిత ద్రోహి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతివ్వడం దురదృష్టకరమని, వారిని నమ్మినవారు సర్వనాశనం అవుతారని అంబటి మండిపడ్డారు. సత్తెనపల్లి పర్యటనలో భాగంగా కంటెపూడి గ్రామంలో దివ్యాంగూరాలిని పరామర్శించడం… ట్రై సైకిల్, లక్ష రూపాయలు ప్రకటించడమూ చంద్రబాబు రాజకీయమేనని అంబటి అన్నారు. జనాలు లేకపోవడంతో కాస్త ఆలస్యంగా వెళ్ళడానికే దివ్యాంగురాలిని పరామర్శిస్తున్నట్లు నాటకం ఆడారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement