Thursday, May 2, 2024

22న అమ‌ర‌జ్యోతి ప్రారంభోత్స‌వం -ర్యాలీగా త‌ర‌లిరావాల‌ని త‌ల‌సాని పిలుపు

హైద‌రాబాద్ – తెలంగాణ‌ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వ‌హించ‌నున్న‌ 22న అమర జ్యోతి ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు ఇచ్చారు.. ఆ రోజు సాయత్రం నాలుగు గంటలకి అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ వాహన ర్యాలీలు నిర్వహించాలని బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. అలాగే అన్ని నియోజక వర్గ కేంద్రాల నుంచి దాదాపు రెండు వేల మందితో ర్యాలీలు చేపట్టాలన్నారు.

ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీలతో సగం ప్రచారం జరిగినట్లు అవుతుందన్నారు. సాయంత్రం ఐదు గంటల లోపు నియోజక వర్గ కేంద్రాల నుంచి ఎమ్మెల్యేలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారులు, డీజేల ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌సంగం అనంత‌రం డ్రోన్ షో ఉంటుంద‌ని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement