Saturday, May 4, 2024

Breaking: అమర్ జవాన్ జ్వాలా జ్యోతి.. 50ఏళ్ల జ్యోతికి నేటితో ముగింపు..

ఇండియా గేట్ వద్ద సైనికుల స్మరణ కోసం ఏర్పాటు చేసి అమర్ జవాన్ జ్యోతి ‘‘శాశ్వత జ్వాల’’ 50 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆర్పివేయనున్నారు. ఈ రోజు జరిగే వేడుకలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని జ్యోతితో విలీనం చేయనున్నట్టు అధికారక వర్గాలు తెలిపాయి. జ్యోతిలో కొంత భాగాన్ని ఈరోజు మధ్యాహ్నం యుద్ధ స్మారకం వద్దకు తీసుకువెళ్లనున్నారు. అయితే.. ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం వారికి దీటుగా సమాధానం ఇచ్చింది ‘‘ చాలా తప్పుడు సమాచారం చెలామణిలో ఉంది’’ అని ప్రభుత్వం తెలిపింది.  ‘అమర్‌ జవాన్‌ జ్యోతి జ్వాల ఆరిపోవడం లేదు.. దాన్ని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో కలిపేస్తున్నారు.. అమర్‌ జవాన్‌ జ్యోతిలోని జ్వాల 1971 నాటి అమరవీరులకు నివాళులర్పించడం విచిత్రం. యుద్ధాలు కానీ వాటి పేర్లు ఏవీ అక్కడ లేవు” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు ఇండియా గేట్ నిర్మించారు. 1971లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమర్ జవాన్ జ్యోతిని ఇండియా గేట్ కింద ఉంచారు. మొదటి ప్రపంచ యుద్ధం, ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన వారి పేర్లు ఇండియా గేట్‌పై చెక్కబడి ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. 1971 యుద్ధంతో సహా స్వాతంత్ర్యం తర్వాత జరిగిన యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల పేర్లు జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో పొందుపరిచాం అని అధికార వర్గాల చెబుతున్నాయి.  అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించడం నిజమైన శ్రద్ధాంజలి (నివాళి) అని వారు చెప్పారు.

‘‘7 దశాబ్దాలుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నిర్మించని వ్యక్తులు ఇప్పుడు మన అమరులకు శాశ్వతమైన, తగిన నివాళులర్పిస్తున్నప్పుడు అరుపులు, కేకలు వేయడం హాస్యాస్పదంగా ఉంది” అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ప్రభుత్వ వర్గాలుపేర్కొన్నాయి. దశాబ్దాల నాటి సంప్రదాయంలో భారీ మార్పుపై సోషల్ మీడియాలో పోస్ట్ లు, ప్రతిపక్ష పార్టీల నుండి రిటైర్డ్ అనుభవజ్ఞులలో ఒక విభాగం నుండి ప్రకటనలు వెల్లువెత్తాయి. దేశభక్తిని, త్యాగాన్ని కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. జ్వాల విలీనం చేయబడే నేషనల్ వార్ మెమోరియల్ 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిని ₹ 176 కోట్ల వ్యయంతో 2019లో నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ స్మారక చిహ్నంలో భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం చేసిన ప్రసిద్ధ యుద్ధాలను వర్ణించే ఆరు కాంస్య కుడ్యచిత్రాలు వీర్త చక్రంలో కప్పబడిన గ్యాలరీలో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement