Thursday, May 9, 2024

Rebels Dominate – ముంబైలో అజీత్ , శ‌ర‌ద్ ప‌వార్ వ‌ర్గాల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న …

ముంబై: ఎన్సీపీ రెబ‌ల్ నేత అజిత్ ప‌వార్ వ‌ర్గం ఇవాళ త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఎంఈటీ సెంట‌ర్‌లో అజిత్ ప‌వార్ త‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ముంబైలో శ‌ర‌ద్ ప‌వార్‌, అజిత్ ప‌వార్ వ‌ర్గాలు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నాయి. వైబీ చౌహాన్ సెంట‌ర్‌లో శ‌ర‌ద్ ప‌వార్ శ్రేయోభిలాషులు అక్క‌డ మీటింగ్ ఏర్పాటు చేశారు. సుప్రియా సూలే నేతృత్వంలో ఆ మీటింగ్ జ‌రిగింది. అజిత్ పవార్ వ‌ర్గంలో ఇవాళ 29 మంది ఎమ్మెల్యేలు మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. స్టేజ్‌పై భారీ స్థాయిలో వాళ్లంతా షో చేశారు . ఎన్సీపీలో మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అజిత్ వ‌ర్గానికి అనుకూలంగా 29 మంది ఎమ్మ‌ల్యే లు హాజ‌ర‌య్యారు.. ఇక శ‌ర‌ద్ ప‌వ‌ర్ వ‌ర్గ మీటింగ్లో 21 మంది ఎమ్మెల్యేలు పాలొన్నారు..

ఇది ఇలా ఉంటే ఎన్ సి పి పార్టీ పేరు, గుర్తు త‌న‌కే కేటాయించాల‌ని కోరుతూ అజిత్ ప‌వార్ ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు.. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement