Saturday, May 4, 2024

గుజరాత్‌లో ఎయిర్‌బస్‌ తయారీ కేంద్రం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎయిర్‌బస్‌ సీ295 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌ క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ తయారీ
కేంద్రానికి అక్టోబర్‌ 30న ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. యూరప్‌ బయట సి-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్‌ కుమార్‌ తెలిపారు. భారత వైమానిక దళంలో పాత ఎవిరో 748 విమానాల స్థానంలో ఎయిర్‌బస్‌కు చెందిన సి-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు.

ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్‌బస్‌తో 21 వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో 16 విమానాలను ఎయిర్‌బస్‌ భారత్‌కు అందించనుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌) తయారీ, అసెంబ్లింగ్‌ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎరోనాటికల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ గత వారం ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement