Thursday, May 16, 2024

Breaking: లోక్ సభలో ఆగంతకులు.. టియర్ గ్యాస్ తో అలజడి..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. లోక్ సభ సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు గ్యాలరీ నుంచి ఛాంబర్ లోకి దూకారు. దీంతో సభకు అంతరాయం ఏర్పడింది. సభ్యులు కూర్చున్న టేబుల్స్ నుంచి ఆగంతకులు సభలోకి దూసుకొచ్చారు. అనంతరం వారు లోక్ సభలో టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.

దీంతో సభ్యులందరూ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై భయంతో పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. భద్రతా సిబ్బంది వచ్చి ఆగంతకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ పై దాడికి 22ఏళ్లు పూర్తైన వేళ ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు నిందితులు. ఆగంతకులు షూ నుంచి వెలువడిన టియర్ గ్యాస్. ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళ వాతావరణం ఏర్పాడింది. ఈ జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో సభను కాసేపు వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement