Wednesday, May 1, 2024

Chhattisgarh – సిఎం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం…ఎల్ ఈ డీలు పేల్చిన న‌క్స‌ల్స్

రాయ్ పూర్ – ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నేడు జ‌ర‌గున‌న్న సంద‌ర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఒక సైనికుడు వీరమరణం పొందాడు. మరొక సైనికుడు గాయపడ్డాడు. నారాయణపూర్‌లోని ఛోటాదొంగర్‌లో సైనికుల సెర్చింగ్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఒక సైనికుడు ఎల్ ఈ డీ పేలుడు బారిన పడ్డాడు. 9వ కార్ప్స్‌కు చెందిన యువ కానిస్టేబుల్ కమలేష్ కుమార్ వీరమరణం పొందాడు. మ‌రో కానిస్టేబుల్ వినయ్ కుమార్ కు స్వ‌ల్పగాయాల‌య్యాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement