న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో నేడు జరిగింది ఎన్నికల సన్నద్ధత వ్యూహాత్మక సమావేశం మాత్రమే కాదని, ఎన్నికలకు శంఖారావం పూరించామని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వెల్లడించారు. రాహుల్తో సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. సంతృప్తి, విభేదాలు ఎక్కడైనా సహజమేనని రేణుక అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పే అధికారంలోకి వస్తామని ఆమె స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎన్నో అబద్దాలు ఆడారని, కాంగ్రెస్ మాత్రం నిజాలనే చెప్పాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యలు వేరన్న రేణుక, వాటికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.