Friday, May 10, 2024

AP | 270 కోట్లతో విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం దేవాలయాల అభివృద్ధి..

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవస్థానాలలో రూ.270 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్ల దేవాదాయ శాఖా మంత్రి కొట్టు- సత్యనారాయణ వెల్లడించారు.రూ.195 కోట్లతో కనక దుర్గమ్మ, రూ.75 కోట్లలో శ్రీశైలం దేవస్థానాలను అభివృద్ది చేయనున్నా మన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సచివాలయంలోదేవాదాయ శాఖ సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాలయంలో అభివృద్ది పనులకై భారీ స్థాయిలో రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులను విడుదల చేసిన ఘనత సీఎం జగన్‌ కు దక్కుతుందన్నారు.

దుర్గా నగర్‌ ప్రవేశ మార్గం ప్రక్కన బి.ఓ.టి. విధానంపై రూ.60 కోట్ల అంచనా వ్యయంతో మెకనైజ్డు మల్లీలెవిల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణానికి ఎక్స్‌ ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్టును పిలుస్తునట్లు- ఆయన తెలిపారు. అదే విధంగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి సంబందించి రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్సు, రూ.35 కోట్లతో సాల మండపాలు మరియు కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రూ.3.60 కోట్లతో అన్నధాన భవనము, రూ.4.00 కోట్లతో క్యూకాంప్లెక్సు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి.లు నివాసం ఉండే ప్రాంతాల్లో ధర్మప్రచారం చేయాలని, దేవాలయాలు నిర్మించాలనే ఉత్తమ ఆలోచనతో శ్రీవాణి ట్రస్టు నిధులతో 1,917 ఆలయాలను మంజూరు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆలయాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన ఎక్కౌంటింగ్‌ విధానాన్ని అమల్లోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. ఇ.ఓ. మినహా మిగిలిన ఉద్యోగులు అందరినీ మూడు మాసాలకు ఒక సారి రొటేషన్‌ విదానంలో స్థాన చలనం చేసే విధంగా నిబందనలను విధించడమైందని తెలిపారు.

- Advertisement -

ఆలయాల్లో బంగారు ఆభరణాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, రాష్ట్రంలోని మూడు జోన్లలో బంగారు ఆబరణాల తనిఖీ అధికారులు ఉన్నారని, ప్రతి మూడేళ్లకు ఒక సారి దేవాలయాల్లోని ఆభరణాలను తనిఖీ చేసి వాటి వివరాలను పబ్లిక్‌ డొమైన్‌ లో ఉంచడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులతో రాష్ట్రంలో నూతన దేవాలయాల నిర్మాణానికి, పాత దేవాలయాల పునరుద్దరణకు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రూ.450 కోట్ల సి.జి.ఎఫ్‌. నిధులను విడుదల చేయడం జరిగిందని, తన హయాంలో దాదాపు రూ.270 కోట్లు- విడుదల చేయడమైందని మంత్రి కొట్టు- సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement