Friday, May 17, 2024

పెళ్ల‌యిన ప‌ది రోజుల‌కే.. మృత్యువు ఒడిలోకి కొత్త జంట‌

దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగివ‌స్తుండ‌గా కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ని మృత్యువు రోడ్డు ప్ర‌మాదం రూపంలో బ‌లి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది. మృతి చెందిన నవదంపతులను మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన ఇంద్రజిత్ మోహన్ దమ్మనాగి, కళ్యాణి ఇంద్రజిత్ దమ్మనాగి 10 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా బాదామిలో బనశంకరి ఆలయ దర్శనం కోసం నవ దంపతులిద్దరూ వచ్చారు. దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. బెలగావి జిల్లా ముదలగి తాలూకా సమీపంలోని హల్లూరు గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దంపతులు కారులో వెళ్తుండగా ట్యాంకర్‌ ఢీకొట్టింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement