Wednesday, May 1, 2024

Adipurush – టికెట్ రేట్లు పెంపు – తెలంగాణలో అదనపు షో కి అనుమతి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది..

కాగా, ఏపీలో ఇప్పటికే 25 నుంచి 50 రూపాయిలు అదనంగా టికెట్ రెట్లు పెంచుకుని అమ్ముకుంటామని అడిగితే సూత్రప్రాయంగా ఓకే చెప్పారు, జీవో కోసం వెయిటింగ్. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాదు జీవో కూడా రిలీజ్ చేసింది. జీవో ప్రకారం 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు టికెట్ రేట్ పెంచి అమ్ముకోవచ్చు. ఆలాగే అదనపు షో కి తెలంగాణ ప్రభుత్వం అనుమితి ఇచ్చింది. అలాగే తెల్లవారు జాము నాలుగు నుంచే షోలు వేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement