Monday, May 6, 2024

ఈవీ రంగంలోకి దూసుకొస్తున్న‌ కేటీఎం.. సూప‌ర్ ఎల‌క్ట్రిక్ బైక్ లాంచ్ చేసేందుకు స‌న్నాహాలు

ఈవీలను రూపొందించేందుకు అనేక ఆటోమొబైల్​ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కేటీఎం కూడా చేరింది. కేటీఎం కంపెనీ ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటలీ మిలాన్​లో ఈ ఏడాదిలో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీనిని ప్రదర్శించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత కొన్ని నెలలకే కేటీఎం ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఇండియాలో ఈ స్కూట‌ర్ ని బజాజ్​ ఆటో మాన్యుఫాక్చ‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇండియాలో తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎగుమతి చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్​కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దా..

- Advertisement -

ఇందులో ఫ్లాట్​ సీట్​, ఫ్లైస్క్రీన్​తో పాటు వీల్స్​ స్పోర్టీగా ఉంటాయని తెలుస్తోంది. ఫ్రెంట్​ ఏప్రన్​ చాలా అగ్రెసివ్​గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఫుట్​బోర్డ్​ ఫ్లాట్​గా, సిల్వర్డ్​ పిలియన్​ గ్రాబ్​ టెయిల్​తో కూడిన సింగిల్​ సీట్​ ఉండొచ్చు. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, అల్యుమీనియం స్వింగ్​ అర్మాతో పాటు అలాయ్​ వీల్స్​ వచ్చే అవకాశం ఉంది.

కేటీఎం ఈ-స్కూటర్​ ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​ వస్తాయని తెలుస్తోంది. సింగిల్​/ డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ సిస్టెమ్​ కూడా ఉండనుంది. ధరకు సంబంధించిన వివరాలు.. లాంచ్​ టైమ్​లో అందుబాటులోకి వస్తాయి. ఈ-స్కూటర్​ గురించి కేటీఎం లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ ప్రాడెక్ట్​ను తీర్చిదిద్దాలని కేటీఎం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement