Friday, April 26, 2024

Adipurush: రూ.400 కోట్లు.. 103 రోజులు.. ‘ఆదిపురుష్’ ఫినిష్!

బాహుబాలితో ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’.  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ తారాగణం, బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రను పోషించగా…. కృతిసనన్ సీత పాత్రలో నటించింది. రావణుడి పాత్రను హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషించారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కేవలం 103 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒక అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. తాము క్రియేట్ చేసిన మేజిక్ ను మీ అందరితో పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement