Tuesday, April 30, 2024

Accident : ప్ర‌మాద‌వ‌శాత్తు గోడ‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్ద‌రు విద్యార్థులు మృతి..

ప్ర‌మాద‌వ‌శాత్తు బైక్ తో గోడ‌ను ఢీకొని ఇద్ద‌రు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. గాజులరామారం నుంచి శాపూర్‌నగర్‌కు బైక్ పై ఇద్ద‌రు విద్యార్థులు వస్తుండగా నెహ్రునగర్ వ‌ద్ద బైక్ గోడను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. మృతులు బేగరి క్రాంతి కుమార్, ఔల సందీప్‎గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement