Sunday, April 28, 2024

Delhi : కేజ్రీవాల్ అరెస్టుకు నిర‌స‌న‌గా.. ఆప్ సామూహిక నిరాహార దీక్ష‌

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసమే బీజేపీ ఈ తరహా కుట్ర పన్నిందని మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. అందులో భాగంగానే డిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి గోపాల్ రాయ్ పిలుపు నిచ్చారు.

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా దేశ విదేశాల్లో ఆప్ నేతలు ఈ తరహా నిరాహార దీక్షలు చేపట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్వగ్రామం కత్‌కర్ కలాన్‌లో దీక్ష చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement