Monday, May 13, 2024

హైద‌రాబాద్ లో గోనెసంచిలో మహిళ మృతదేహం..

హైద‌రాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో గోనెసంచిలో మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. కూకట్ పల్లి నుండి మూసాపేట రైల్వే రోడ్డు వైపే వెళ్లే మార్గంలో గోనెసంచిలో మహిళ మృతదేహం కన్పించింది. స్థానికంగా పిల్లలు క్రికెట్ ఆడుతుండ‌గా బాల్ కోసం అక్కడికి వచ్చారు. అయితే గోనె సంచి నుండి కాలు బయటకు కన్పించింది. దీంతో భయపడిన పిల్లలు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని గోనెసంచిలోని మహిళ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. గోనెసంచిలో ఉన్న మహిళ డెడ్ బాడీ ఎవరిదనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన మహిళ వయస్సు 30-35 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement