Tuesday, May 14, 2024

కల్వర్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు..

కల్వర్టర్ ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన పెద్దపెల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి మంథని మండలం సూరయ్యాపల్లి గ్రామానికి చెందిన నార మల్ల ఆశిష్, గంగాపురికి చెందిన జంజర్ల సాయి చరణ్ లు ద్విచక్ర వాహనంపై గంగపురికి వెల్తుండగా మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా సాయిచరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సాయి చరణ్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement