Friday, May 3, 2024

‘పతంజలి’కి షాక్‌.. ఆ ఐదు ఔషధాల తయారీని నిలిపేయాలంటూ ఆయుర్వేద నియంత్రణ మండలి ఆదేశాలు

డెహ్రాడూన్‌: యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఔషధ సంస్థ పతంజలి దివ్వ ఫార్మసీకి ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి షాక్‌ ఇచ్చింది. మధుగ్రిట్‌, ఐగ్రిట్‌, థైరోగ్రిట్‌, బీపీ గ్రిట్‌, లిపిడామ్‌ తదితర ఔషధాల తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించాలని పేర్కొంది. అలాగే తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు తమ అనుమతి పొందిన తర్వాతే ఇవ్వాలని ఆంక్షలు విధించింది. ఉల్లంఘిస్తే ఔషధ తయారీ లైసెన్స్‌ను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement