Wednesday, May 15, 2024

హైదరాబాద్ లో వెలుగుచూసిన కొత్తరకం మోసం

హైదరాబాద్ లో కొత్తరకం మోసం వెలుగుచూసింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. కువైట్ లో ఉద్యోగం కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈసందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ… గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు తప్పనిసరని తెలిపారు. ఒకసారి రిజెక్ట్ అయిన యువకులు మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వేలిముద్రలకు ఆపరేషన్ చేయించుకొని రిజెక్ట్ అయిన తర్వాత కూడా యువకులు వెళ్తున్నారన్నారు. ఏడాది పాటు వేలిముద్రలు కనబడకుండా ఉండేవిధంగా కొత్త రకం సర్జరీ చేస్తున్నారన్నారు. సర్జరీ చేసుకున్న తర్వాత యువకులు దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారన్నారు. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement