Sunday, April 28, 2024

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడ‌ని క‌న్న‌కొడుకును చంపిన త‌ల్లి

త‌న వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని క‌న్న‌కొడుకునే త‌ల్లి క‌డ‌తేర్చింది. ఈదారుణ ఘ‌ట‌న‌ వైఎస్సార్‌ కడప జిల్లా జిల్లా బద్వేలు పట్టణంలోని రూపారాం పేటలో చోటు చేసుకుంది. కవిత అనే వివాహిత రెండు వారాల క్రితం నాలుగేండ్ల కొడుకును వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది. కొడుకు క‌నిపించ‌క‌పోవ‌డంతో క‌వితను భ‌ర్త అడుగ‌గా.. తెలియ‌ద‌ని చెప్పింది. ఎంత‌గాలించినా దొర‌క్క‌పోవ‌డంతో చివరకు పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కవితను ఆమె ప్రియుడు వినోద్‌ను విచారించారు. దీంతో చేసేదేమీ లేక తామే హత్య చేసి ఇంటికి సమీపంలో పాతిపెట్టినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు స్థానిక అధికారుల‌తో క‌లిసి ఘటనా స్థలానికి వెళ్లి తహసీల్దార్‌ సమక్షంలో గోయి తవ్విచూడగా బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. కాగా ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement