Tuesday, May 7, 2024

క్షుద్రపూజల పేరుతో అప్పుడు… బంధువులు కొట్టారని ఇప్పుడు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. సీపీ కార్యాలయం ముందు ఓయువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డాడు.అయితే గతంలో క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అతి కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడు కాగా ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా తాజాగా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. భార్యభర్తల మధ్య గొడవే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

భార్య తరుపు బంధువు తనపై దాడి చేశాడని అందుకే న్యాయం కోసం ఆత్మహత్య యత్నంకి పాల్పడినట్లు బాధితుడు నాగరాజు తెలిపారు. అయితే మందు సేవించిన వ్యక్తిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement