Thursday, May 2, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పెద్దమొత్తంలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుని వద్ద అక్రమంగా తరలిస్తున్న 957 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు.. పట్టుబడ్డ బంగారం విలువ రూ.46.53 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement