Wednesday, May 15, 2024

968.8 కోట్ల బోనస్‌ ప్రకటించిన ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌..

ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2022 ఆర్ధిక సంవత్సరానికి 968.8 కోట్ల రూపాయల బోనస్‌ ప్రకటించింది. అర్హులైన పాలసీదారులకు ఈ మొత్తాన్ని బోనస్‌గా చెల్లిస్తారు. కంపెనీ వరసగా 16వ సంవత్సరం పాలసీదారులకు బోనస్‌ ప్రకటించింది. గత సంవత్సరం చెల్లించిన బోనస్‌ కంటే ఇది 12 శాతం అధికమని కంపెనీ తెలిపింది. 2022, మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉన్న పాలసీలు ఉన్న కస్టమర్లకు ఈ బోనస్‌ అందుతుందని తెలిపింది.

ఇలాంటి కస్టమర్లు పది లక్షల వరకు ఉన్నారు. కంపెనీ ప్రారంభమైన తరువాత ఇదే అత్యధిక బోనస్‌ అని ఐసీఐసీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో ఎన్‌.ఎస్‌. కన్నన్‌ చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంపెనీ బోనస్‌ ప్రకటించడానికి, దాని నిర్వాహణ సామర్ధ్యం మెరుగ్గా ఉండటమే కారణమని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement