Tuesday, May 7, 2024

ముగిసిన టీఎస్‌ ఐసెట్‌.. 90.56 శాతం హాజరు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రెండు రోజుల పాటు జరిగిన టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 90.56 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 75,952 మంది దరఖాస్తు చేసుకోగా 68,781 మంది హాజరుకాగా, 7171 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి తెలిపారు.

ఈనెల 27, 28వ తేదీల్లో రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement