Tuesday, April 30, 2024

ఇండియాలో కొత్తగా 3805 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొంతకాలంగా కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 3805 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,91,112కు చేరాయి. ఇందులో 4,40,24,164 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,655 మంది మరణించారు. మరో 38,293 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 13 మంది మృతిచెందగా, 5069 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement